: మేకను కాపాడబోయి ముగ్గురి మృతి

మేకను కాపాడబోయిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...కాన్పూర్ జిల్లా ఘతంపూర్ కు చెందిన యాదవ్ అనే వ్యక్తికి చెందిన మేక నేలబావిలో పడిపోయింది. దానిని బయటకు తీసేందుకు యాదవ్ బావమరిది నూతిలోకి దూకేశాడు. అయితే ఎంతకూ అతను బయటకు రాకపోవడంతో యాదవ్, అతని సోదరుడు కూడా దూకారు. ముగ్గురూ ఎంతకూ బయటకు రాకపోవడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈత వచ్చిన ముగ్గురూ బయటకు రాలేదని పేర్కోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు, బావిలో విషవాయువులు ఉన్నాయని, వాటి కారణంగా వారు ముగ్గురూ మృతిచెందారని తేల్చారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

More Telugu News