: మాగంటి బాబు బ్యాచ్ పై చంద్రబాబు ఆగ్రహం!

కృష్ణా జిల్లా నూజివీడు టీడీపీ ఇన్ చార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు, ప్రస్తుత ఎంపీ మాగంటి బాబు వర్గాల మధ్య విభేదాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. నేడు నూజివీడులో 'వనం - మనం' కార్యక్రమం జరుగగా, ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కార్యక్రమం నూజివీడులో జరుగుతున్న వేళ, ముద్రబోయిన వర్గాన్ని వేదికపైకి పిలవడంతో ఘర్షణ ప్రారంభమైంది. మాగంటి బాబు అనుచరులు ముద్రబోయిన వర్గాన్ని స్టేజ్ పైకి రాకుండా అడ్డుకుని నిరసన తెలిపారు. వేదికపైనే ఉన్న చంద్రబాబునాయుడు, కల్పించుకుని మాగంటి బాబు వర్గంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ తరహా విభేదాలు కూడదని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. వీరిద్దరి మధ్యా దీర్ఘకాలంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News