: మనిషి పుర్రెలతో దర్శకుడు పూరీ వినూత్న మెసేజ్

హిట్ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ తనదైన శైలిలో మెసేజ్ ను తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఎంతో క్రియేటివీటితో ఉన్నఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కులాలు, మతాలు, ఆడ, మగ, పేద, ధనిక, నువ్వు, నేను.. అందరి మధ్య ఎన్ని తేడాలున్నా.. అంతర్గతంగా అందరూ ఒకటేనంటూ వరుసగా ఉన్న పుర్రెల ఫొటో ఒక దానిని పూరీ జగన్నాథ్ పోస్ట్ చేశాడు. ‘హిందూ, ముస్లిం, క్రిస్టియన్... రిచ్, పూర్, యు, మీ’ అంటూ మొత్తం 16 పుర్రెల కింద ఒక్కో క్యాప్షన్ పూరీ రాశాడు.

More Telugu News