: రెండో టెస్ట్ కోసం కింగ్స్టన్ చేరుకున్న టీమిండియా
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా తొలి టెస్టులో ఘన విజయాన్ని నమోదు చేసుకున్న అనంతరం రెండో టెస్టులో పాల్గొనడానికి ఈరోజు కింగ్స్టన్ చేరుకుంది. రెండో టెస్టు మ్యాచు జులై 30 నుంచి ఆగస్టు 3 వరకు జరగనుంది. భారత జట్టు రెండో టెస్టు కోసం జమైకా నుంచి బయలుదేరి కింగ్స్టన్ చేరుకుందని బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పింది. వెస్టిండీస్తో మూడో టెస్టు ఆగస్టు 9 నుంచి 13 వరకు జరగనుండగా నాలుగో టెస్టు ఆగస్టు 18 నుంచి 22 వరకు జరుగుతుంది. వెస్టిండిస్లోని అంటిగ్వాలో టీమిండియా తొలి టెస్టును ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో గెలుపొంది ఘన విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సాధించి మంచి హుషారుతో ఉంది.