: నర్సింగ్ యాదవ్ వివాదం డీటెయిల్స్ ఇవ్వండి: రెజ్లింగ్ సమాఖ్యను ఆదేశించిన మోదీ

రెజ్లర్ల వివాదం ప్రధాని కార్యాలయం చేరింది. రియో ఒలింపిక్స్ కు సెలెక్ట్ అయిన నర్సింగ్ యాదవ్ డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో అది పెను వివాదమైంది. దీనిపై మీడియా వరుస కథనాలు ప్రసారం చేయడంతో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ను వివరణ అడిగారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాలను అందజేయాలని ఆయనను ఆదేశించారు. 74 కేజీల విభాగంలో రియో ఒలింపిక్స్ కు నర్సింగ్ యాదవ్ సెలెక్ట్ అయిన నాటి నుంచి అతని చుట్టూ వివాదం రాజుకుంటూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా నర్సింగ్ డ్రగ్ టెస్టులో విఫలం కావడం పెను కలకలం రేపింది.

More Telugu News