: తైవాన్లో ఘోర ప్రమాదం.. 26 మంది పర్యాటకులు మృతి
పర్యాటకుల బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో 26 మంది మృతి చెందిన ఘటన తైవాన్ రాజధాని తైపీలో చోటు చేసుకుంది. ప్రమాదంలో మరి కొంతమంది గాయాలపాలయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం అక్కడి తావోయువాన్ కౌంటీలోని రెండో నంబర్ జాతీయ రహదారిపై పర్యాటకులతో ఓ బస్సు వెళుతోంది. అయితే అదుపుతప్పి బారియర్లను ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో 26 మంది మృతి చెందారు, మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రయాణిస్తోన్న వారంతా చైనాకి చెందిన పర్యాటకులేనని తెలుస్తోంది.