: తిరుగుబాటుదారులందరికీ మరణశిక్ష: టర్కీ అధ్యక్షుడు ఎడ్రోగన్

టర్కీలో తిరుగుబాటుకు యత్నించి, ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిన సైన్యంలోని ఓ వర్గానికి చెందిన సభ్యులందరికీ మరణదండనే సరైన శిక్షని, వారికి మరణశిక్షను విధించే ఆలోచనలో ఉన్నామని అధ్యక్షుడు ఎడ్రోగన్ ప్రకటించారు. రాజద్రోహానికి ఇంతకన్నా మించిన శిక్ష ఉండబోదని, ఈ విషయంలో ప్రజల అభిప్రాయాన్ని కూడా అడుగుతామని తెలిపారు. సైనిక తిరుగుబాటు విఫలం కావడానికి ప్రజలే కారణమని, వారే లేకుంటే ఈ పాటికి దేశంలో ప్రజాస్వామ్యం హరించుకుపోయి ఉండేదని అభిప్రాయపడ్డారు. కాగా, టర్కీలో సైనిక తిరుగుబాటు, ప్రజల స్పందన కారణంగా జరిగిన అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 290కి చేరింది. న్యాయవ్యవస్థ, సైనిక వ్యవస్థలకు చెందిన ముఖ్యమైన అధికారులు సహా 6 వేల మందిని ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. వీరందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసిన వారే. వీరికి మరణశిక్ష విధిస్తే, వర్తమాన ప్రపంచంలో ఇంత మందికి మరణదండన విధించిన దేశంగా టర్కీ మిగులుతుంది. ప్రపంచదేశాలు మరణశిక్షలు వద్దని టర్కీని వారించే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News