: కోహ్లీని కలవలేదని ప్రకటన విడుదల చేసిన అనుష్క

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో సినీ నటి అనుష్క శర్మ ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా కొంత కాలం ఎడబాటు అనుభవించిన ఈ జంట మళ్లీ కలిసిపోయారు. దీంతో వీరికి సంబంధించిన వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు శిబిరంలో ఉన్న కోహ్లీని కలిసేందుకు అనుష్క శర్మ అక్కడికి వెళ్లిందని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. వీటికి స్పందించిన అనుష్క మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. సుల్తాన్ ప్రమోషన్ లో బిజీగా ఉండడంతో అనారోగ్యంతో బాధపడుతున్నానని, ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపింది. తాను విరాట్ ను కలిశానంటూ అవాస్తవ కథనాలు ప్రసారం చేయొద్దని సూచించింది. గతంలో వెలువడిన వార్తలన్నీ అవాస్తవాలని ఆ ప్రకటనలో అనుష్క శర్మ పేర్కొంది.

More Telugu News