: ఆ శిల్పం ఆ నెలల బాలుడికి 'అమ్మ'లా అనిపించింది!

కళలు ఎవరినైనా మంత్రముగ్ధులను చేయగలవు. అంతటి శక్తి వాటికి ఉంటుంది. ఓ శిల్పికి నెలల బాలుడు వంద మార్కులు వేసే పనిని చేసి సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా చైనాలో ఓ ఎగ్జిబిషన్ జరిగింది. అందులో పలు శిల్పాలను ప్రదర్శించారు. వీటిని వీక్షించేందుకు ఓ తల్లి తన నెలల కుమారుడిని తీసుకుని వెళ్లింది. అలా ఆమె ఆ శిల్పాలను వీక్షిస్తున్న వేళ... ఆమె చంకలో వున్న బాలుడు ఆమె ఒడి నుంచి ముందుకు వంగి శిల్పం నుంచి పాలు తాగేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ ఔత్సాహికుడు క్లిక్ మనిపించి, దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో పిల్లాడి ఆకలి తీర్చలేకపోయిన తల్లికి చీవాట్లు; తల్లి ఒడిలో వున్న చిన్నారి కంటికి ఆ శిల్పాన్ని ప్రాణమున్న తల్లిగా భ్రమింపజేసిన శిల్పి నైపుణ్యానికి ప్రశంసలు దక్కుతున్నాయి. గతంలో ఓ చిత్రకారుడు గీసిన పూల స్కెచ్ వద్దకు సీతాకోక చిలుకలు వచ్చి వాలిపోయాయట. ఈ సంఘటన కూడా అలాంటిదే!

More Telugu News