: హుస్సేన్ సాగర్ తీరంలో జాతీయ సెయిలింగ్ పోటీలు ప్రారంభం
హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో ఈరోజు జాతీయస్థాయి సెయిలింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. పోటీలు వారం రోజుల పాటు జరగనున్నాయి. క్రీడాకారుల బోట్లను నరసింహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రమించే తత్వం, అంకిత భావంతో అద్భుతాలు సాధించవచ్చని అన్నారు. ఏషియన్, ఒలింపిక్ గేమ్స్లో దేశానికి పతకాలు తేవాలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో 31 ఏళ్లుగా పోటీలు జరగడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. కాలక్షేపానికి కాకుండా భవిష్యత్ కోసం క్రీడాకారులు పాటుపడాలని గవర్నర్ పిలుపునిచ్చారు.