: బ్రెయిన్ కేన్సర్‌తో మాజీ మిస్ వరల్డ్ కన్నుమూత

బ్రెయిన్ కేన్సర్‌తో మాజీ మిస్ వరల్డ్ యుమారా లోపెజ్(22) కన్నుమూశారు. 2014లో నికరాగ్వాకు ప్రాతినిధ్యం వహించిన ఆమె గత కొంతకాలంగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఆమె మనాగ్వాలోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారు. లండన్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న అనంతరం ఆమెకు బ్రెయిన్ కేన్సర్‌ ఉన్నట్టు తెలిసింది. తరచూ తీవ్రమైన తలనొప్పి రావడం, చూపు మందగించడంతో పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆమెను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ కేన్సర్ ఉన్నట్టు తేల్చారు. తనకు ఈ జబ్బు ఉన్నట్టు తెలిసినా ఆమె ఎంతో నిబ్బరంగా ఉండేవారు. ఈ వ్యాధి నుంచి బయటపడిన వారిని ఆదర్శంగా తీసుకుని తాను కూడా బ్రెయిన్ కేన్సర్‌ను జయించగలనని భావించేవారని ఆమె సన్నిహితులు తెలిపారు. అయితే వ్యాధి తీవ్రత ముదరడంతో ఆమె కన్నుమూశారు.

More Telugu News