: రాణించిన జింబాబ్వే బ్యాట్స్ మెన్... ఇండియా టార్గెట్ 171 పరుగులు

జింబాబ్వే-భారత్‌ మధ్య హరారేలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌ లో జింబాబ్వే జట్టు ఆకట్టుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే బ్యాట్స్ మన్ మెరుపులు మెరిపించారు. ఓపెనర్లు మసకద్జ (25), చిబాబా (20) ఆకట్టుకున్నారు. అనంతరం సికిందర్ రజా (20), వాలర్ (30) కూడా దూకుడుగా ఆడారు. ముతుంబోద్జి (3) విఫలం కాగా, అనంతరం వచ్చిన చిగుంబుర శివాలెత్తాడు. ఉనద్కత్ వేసిన 19వ ఓవర్‌ లో రెండు సిక్సర్లు బాదేశాడు. ఒక సిక్సర్ కి బాల్ వెళ్లి స్టేడియం బయటపడడం విశేషం. ఈ ధాటికి ఉనద్కత్ తడబడి రెండు వైడ్‌ లు వేసేశాడు. ఈ క్రమంలో చిగుంబురా (54) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు, చాహల్, అక్షర్ పటేల్, రిషిధావన్ చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు పరుగులేమీ చేయకుండానే కేఎల్ రాహుల్ వికట్ ను కోల్పోయింది. ట్రిపానో సంధించిన బంతి ఎడ్జ్ తీసుకుని ఆఫ్ స్టంప్ ను గిరాటేయడంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. రాయుడు (10), మన్ దీప్ సింగ్ (5) క్రీజులో ఉన్నారు.

More Telugu News