: నాసా సరికొత్త ఆవిష్కరణ... బ్యాటరీతో నడిచే విమానం!

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బ్యాటరీతో నడిచే విమానాన్ని రూపొందిస్తోంది. దీనికి ‘ఎక్స్‌-57’ అనే పేరుతో పాటు, ‘మ్యాక్స్‌ వెల్‌’ అనే నిక్ నేమ్ కూడా పెట్టారు. తక్కువ ఇంధనంతో, తక్కువ ధరకే లభించేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దీనిని రూపొందించనున్నట్టు నాసా ఓ ప్రకటనలో తెలిపింది. తక్కువ శబ్దంతో, వేగంగా ప్రయాణించేందుకు వీలుగా, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తయారు చేయనున్నట్టు నాసా పేర్కొంది. 14 ఎలక్ట్రిక్‌ మోటార్స్‌ తో కొత్త ప్రొపల్షన్‌ టెక్నాలజీతో ప్రయోగాత్మకంగా నాసా ఈ విమానాన్ని తయారుచేయనున్నట్టు చెబుతోంది. 19వ శతాబ్దంలో ఎలక్ట్రో మ్యాగ్నటిజమ్‌ రంగంలో విశేషమైన పరిశోధనలు చేసిన స్కాటిష్‌ శాస్త్రవేత్త జేమ్స్‌ క్లర్క్‌ మాక్స్‌ వెల్‌ పేరిట దీనిని తయారు చేయనున్నామని, అందుకే దీనికి ‘మ్యాక్స్‌ వెల్‌’ అని పేరు పెట్టామని నాసా తెలిపింది.

More Telugu News