: మహేశ్ బాబుతో నాది 'వన్ వే లవ్'!: వెన్నెల కిశోర్

తెలుగు సినీ పరిశ్రమలో మహేశ్ బాబు తనకు ఇష్టమైన హీరో అని హాస్యనటుడు వెన్నెల కిశోర్ చెప్పాడు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, మహేశ్ బాబుతో తనది 'వన్ వే లవ్' స్టోరీ అని చెప్పాడు. మహేశ్ పక్కన చిన్న పాత్ర చేసినా తనకు మంచి మైలేజ్ వస్తుందని తెలిపాడు. మహేశ్ డెడికేషన్ చూస్తుంటే భలే ముచ్చటేస్తుందని అన్నాడు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాడని ఆయన చెప్పారు. అందుకే ఆయనంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు. ఇప్పుడున్న నటుల్లో సాయి ధరమ్ తేజ్ తో తనకు మంచి స్నేహం కుదరిందని అన్నాడు. తామిద్దరం సాయంత్రం కలుస్తుంటామని, క్రికెట్ ఆడుకోవడం, సరదాగా గడపడం చేస్తుంటామని చెప్పాడు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే కోరికలు తనకు లేవని, జీవితం ఇలాగే సాగిపోతే చాలని పేర్కొన్నాడు.

More Telugu News