: అనిల్ కపూర్ తనయుడి సినిమా ట్రైలర్ విడుదల

బాలీవుడ్ లో మరో స్టార్ హీరో వారసుడి అరంగేట్రానికి సర్వం సిద్ధమైంది. 'కిషన్ కన్నయ్య', 'మిస్టర్ ఇండియా', 'తేజాబ్' వంటి సినిమాలతో బాలీవుడ్ లో అగ్రహీరోగా ఎదిగిన అనిల్ కపూర్ తన కుమారుడు హర్షవర్థన్ కపూర్ ను హీరోగా పరిచయం చేస్తున్నారు. రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో రూపొందుతున్న 'మిర్జియా' సినిమాలో హర్షవర్థన్ కపూర్ సరసన సయామీ ఖేర్ ('రేయ్' తెలుగు సినిమా నాయిక) కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరికీ బాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. మిర్జియా సినిమా ట్రైలర్ ను నేడు విడుదల చేశారు. ట్రైలర్ ను బట్టి పీరియాడికల్ లవ్ డ్రామాలా ఈ సినిమా కనిపిస్తోంది. కాగా, అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఇప్పటికే హీరోయిన్ గా పేరు తెచ్చుకోగా, అనిల్ కపూర్ అన్న కుమారుడు అర్జున్ కపూర్ కూడా హీరోగా రాణిస్తున్నాడు.

More Telugu News