: ధోనీ! నిర్ణయం నీదే...నువ్వెలా అంటే అలా: జింబాబ్వే పర్యటనపై సెలక్టర్లు

వచ్చే నెలలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెట్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోని ఎంపికపై టీమిండియా సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోని విషయం తెలిసిందే. అయితే...కోహ్లీ, రోహిత్, ధావన్ లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు ధోనీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ టోర్నీలో ధోనీ కెప్టెన్ గా వ్యవహరిస్తాడా? లేదా? అనే నిర్ణయం ఆయనకే వదిలేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జింబాబ్వే జట్టుపై ప్రథమ శ్రేణి జట్టు అవసరం లేదన్నది సెలక్టర్ల ఆలోచన, దీంతో ఈ టోర్నీ ద్వారా భారత్ రిజర్వ్ బెంచ్ ను పరీక్షించాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో ముగ్గురికి విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు ధోనీపై తమ నిర్ణయం రుద్దాలని భావించలేదు. నిర్ణయం తీసుకునే అధికారం ధోనీకే వదిలేయాలని నిర్ణయించారు. ఈ మేరకు చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశమై, జింబాబ్వే పర్యటనకు వెళ్లాలనుకున్నా, లేక విశ్రాంతి తీసుకోవాలన్నా అతని ఇష్టానికే వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారు.

More Telugu News