: గుంటూరు జిల్లాలో అడుగుపెట్టిన మహేష్ బాబు...అభిమానుల ఘన స్వాగతం

ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు గుంటూరు జిల్లా చేరుకున్నాడు. స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకున్న మహేష్ బాబు తొలిసారి ఆ గ్రామంలో పర్యటించనున్నాడు. హైదరాబాదు నుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్న మహేష్ బాబుకు గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. అభిమానుల కేరింతల మధ్య, వారు ర్యాలీగా అనుసరిస్తుండగా మహేష్ బాబు బుర్రిపాలెం బయల్దేరారు. కాసేపట్లో ఆయన బుర్రిపాలెం చేరుకోనున్నారు. కాగా, ఆయన రాకకోసం భారీ ఎత్తున మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మహేష్ కు రక్షణగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News