: ఆ వివాదం వాళ్ల వ్యక్తిగతం...త్వరలో సమసిపోతుంది: బాలీవుడ్ నటులు

బాలీవుడ్ లో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా వారి మధ్య వచ్చే కామన్ టాపిక్ ఏంటంటే, హృతిక్ రోషన్-కంగనా రనౌత్ వివాదం. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సిద్ధార్థ్ మల్హోత్రాలను ఈ వివాదంపై మీడియా ప్రశ్నలు సంధించింది. దీనికి సిద్దార్థ్ మల్హోత్రా సమాధానమిస్తూ ఆ వివాదం వారిద్దరి వ్యక్తిగతమని స్పష్టం చేశాడు. దానిపై మాట్లాడడం ఇతరులకు సరికాదని, దానిపై ఏదైనా మాట్లాడే హక్కు వారిద్దరికే ఉందని చెప్పాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ, ఈ వివాదం త్వరలోనే సమసిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. వారిద్దరూ సమస్యను పరిష్కరించుకుంటారని చెప్పింది. వివాదం కారణంగా వారి మానసిక పరిస్థితిని తాను అర్ధం చేసుకోగలనని చెప్పిన జాక్వెలిన్, దీనిని అధిగమించి వారిద్దరూ సరైన పంథాలో వెళ్తారని ఆశిస్తున్నానని పేర్కొంది.

More Telugu News