: బీసీసీఐ డే-నైట్ 'టెస్ట్‌మ్యాచ్' ప్ర‌ణాళిక‌లు... ఉత్సాహం క‌న‌బ‌రుస్తోన్న న్యూజిలాండ్

టెస్టు మ్యాచ్‌లకు ప్రజాదరణ పెంచేందుకు బీసీసీఐ ఈ ఏడాది నిర్వ‌హించ త‌ల‌పెట్టిన డే-నైట్ టెస్ట్‌మ్యాచ్ ప‌ట్ల న్యూజిలాండ్ ఉత్సాహాన్ని క‌న‌బ‌రుస్తోంది. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్‌, టీమిండియా మ‌ధ్య‌ డే-నైట్‌ టెస్టు మ్యాచ్‌ నిర్వ‌హించ‌డానికి బీసీసీఐ సిద్ధ‌మైంది. అయితే, త‌మ‌తో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన డే-నైట్‌ టెస్టు మ్యాచ్ ప‌ట్ల పూర్తి వివ‌రాల‌ను అందించాల‌ని బీసీసీఐను న్యూజిలాండ్ క్రికెట్ కోరింది. డే-నైట్ టెస్ట్‌మ్యాచ్ వేదికలోని సదుపాయాల‌పై వివ‌రాలు ఇవ్వాల‌ని సూచించింది. స్టేడియంలోని లైటింగ్ క్వాలిటీపైన, ఆట స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించే తీరుపైన, ప్రాక్టీస్ చేసుకునే అవ‌కాశాలపైన త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల్సిందిగా కోరింది. న్యూజిలాండ్ క్రికెట‌ర్ల‌తో, టీమ్ మేనేజ్‌మెంట్‌తో బీసీసీఐ ఓసారి చ‌ర్చించాల‌ని సూచించింది. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్‌తో ఒక డే-నైట్‌ టెస్టు మ్యాచ్‌ ఆడాలని నిర్ణయించామ‌ని, ఈ మ్యాచ్‌లో పింక్‌ బాల్‌ను ఉపయోగిస్తామ‌ని ఇటీవ‌లే బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. దీనికంటే ముందు ఒక మ్యాచ్‌ను ప్రాక్టీస్‌గా ఆడతార‌ని పేర్కొన్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌తో గాలిలో తేమ, భారత పిచ్‌లపై స్పిన్నర్ల బౌలింగ్, లైటింగ్ క్వాలిటీ త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించ‌నున్నారు.

More Telugu News