: అభిమాన పాప్ సింగర్ ముద్దును 60 లక్షలకు వేలంలో దక్కించుకున్న యువతి

పాప్ సింగర్ ముద్దును 60 లక్షల రూపాయలకు దక్కించుకుని ఓ యువతి సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... పాప్ సింగర్ రికీ మార్టిన్ బ్రెజిల్ లోని సావోపాలోలో ఎయిడ్స్ మహమ్మారి బాధితుల కోసం ఓ ఛారిటీకి విరాళం ఇవ్వాలని భావించాడు. దీంతో తన ముద్దును వేలం వేశాడు. పాప్ సింగర్ గా ఎంతో క్రేజ్ ఉన్న రికీ మార్టిన్ ముద్దును వేలం వేయడంతో అతని ముద్దు కోసం చాలా మంది అభిమానులు పోటీ పడ్డారు. వీరిలో అనా పౌలా డినిజ్ అనే మహిళ తన అభిమాన పాప్ సింగర్ ను ముద్దాడేందుకు 60 లక్షల రూపాయలు చెల్లించింది. దీంతో రికీ మార్టిన్ తన అభిమాని అనా పౌలా డినిజ్ ను గాఢంగా చుంబించాడు. కాగా, రికీ మార్టిన్ గతంలోనే తాను గేనని ప్రకటించాడు. ఈ ముద్దు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియా ట్రెండింగ్ లో కూడా ఈ ముద్దు చోటు చేసుకోవడం విశేషం.

More Telugu News