: టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్ ల మధ్య ఆసక్తికర పోరు...విజయం ఎవరిది?

టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య నేడు ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ సీజన్ 9 లో భాగంగా బెంగళూరు వేదికగా కాసేపట్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ రెండు జట్లు ఈ సీజన్ లో తలపడడం ఇదే తొలిసారి. రెండు జట్లు టోర్నీలో ఫేవరేట్లుగా బరిలో దిగినా స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించడంలో విఫలమయ్యాయి. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారోనని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బెంగళూరు జట్టు బలంగా కనిపిస్తున్నప్పటికీ వరుస ఓటములు ఆ జట్టు స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నప్పటికీ బౌలింగ్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోవడంతో ప్రత్యర్థులు ఆ జట్టును సునాయాసంగా ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ధోనీ జట్టులో ప్రతిభకు కొదువ లేనప్పటికీ సమష్టిగా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో ధోనీ కెప్టెన్సీ కూడా కొరగాకుండా పోతోంది. ఈ నేపధ్యంలో నేటి మ్యాచ్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారు మానసిక స్థైర్యం పుంజుకుని, తరువాతి మ్యాచ్ లలో విజృంభించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News