: 22న సినీనటి రేష్మీ మీనన్ వివాహం

సినీ నటుడు బాబీ సింహా, నటి రేష్మీ మీనన్ లు ఒక ఇంటివారు కానున్నారు. ఈ నెల 22వ తేదీన తిరుపతిలో వీరి వివాహం జరగనుంది. ఈ సందర్భంగా నటుడు బాబీ సింహా మాట్లాడుతూ, కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితుల సమక్షంలో తమ వివాహం జరగనుందన్నారు. చెన్నైలో నిర్వహించనున్న రిసెప్షన్ కి సినీ ప్రముఖులు హాజరుకానున్నారని చెప్పారు. కాగా, సినీ ప్రేమికుల జంట బాబీ సింహా, రేష్మీ మీనన్ ల ఎంగేజ్ మెంట్ గత నవంబర్ లో జరిగింది. బాబీ సింహా తెలుగు, తమిళ్,మళయాళ చిత్రాలలో నటించాడు. రేష్మీ మీనన్ తమిళ్, తెలుగు చిత్రాలలో నటించింది.

More Telugu News