: విజయ్ మాల్యా రూ. 4 వేల కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన బ్యాంకుల కన్సార్టియం

బ్యాంకులకు రూ. 4 వేల కోట్లను చెల్లిస్తానంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యాకు చుక్కెదురైంది. ఆయన చేసిన ఆఫర్ ను బ్యాంకులు తిరస్కరిస్తున్నట్టు కోర్టుకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం వెల్లడించింది. తమకు ఆయన నుంచి రూ. 9 వేల కోట్లు రావాల్సి వుందని, రూ. 4 వేల కోట్ల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని కన్సార్టియం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, బ్యాంకుల తిరస్కరణపై స్పందించి, కొత్త ప్రతిపాదనలతో వచ్చేందుకు రెండు వారాల సమయం కావాలని కింగ్ ఫిషర్ యాజమాన్యం కోరింది. కేసు తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.

More Telugu News