: టీ20 ఉమెన్స్ వ‌రల్డ్‌క‌ప్: 5 ప‌రుగుల‌తో ఆస్ట్రేలియా విజయం... ఫైనల్స్ కి చేరిక!

టీ20 ఉమెన్స్ వ‌రల్డ్‌క‌ప్ తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజ‌యం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జ‌ట్టు ఆస్ట్రేలియా నిర్దేశించిన 133ప‌రుగుల ల‌క్ష్యం దిశ‌గా పోరాడి ఓడింది. 20 ఓవ‌ర్లలో ఏడు వికెట్ల న‌ష్టానికి 127 ప‌రుగులు చేసింది. దీంతో 5ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ ప‌రాజ‌యం పాలైంది. దీంతో ఆస్ట్రేలియా జ‌ట్టు వ‌రల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది.

More Telugu News