: నెహ్రా ఖాతాలో ఆసీస్ మొదటి వికెట్టు

టీ20 మ్యాచ్ లో ఆసీస్ మొదటి వికెట్ ను టీమిండియా బౌలర్ నెహ్రా పడగొట్టాడు. 4.2 ఓవర్ లో నెహ్రా వేసిన బంతిని కొట్టిన ఖవాజా కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. నెహ్రా, బుమ్రా, అశ్విన్ బౌలింగ్ లో ఖవాజా ఏడు ఫోర్లు బాదాడు. పదహారు బంతులు ఆడిన ఖవాజా 26 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజ్ లో ఫించ్, వార్నర్ ఉన్నారు. 5.3 ఓవర్లలో 56 పరుగులు చేసిన ఆసీస్ జట్టు ఒక వికెట్ నష్టపోయింది.

More Telugu News