: కరేబియన్ల లక్ష్యం 124

టీ 20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ కు ఆఫ్గనిస్థాన్ స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఆఫ్గనిస్తాన్ జట్టు 123 పరుగులు చేసింది. కాగా, టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ బరిలోకి దిగిన ఆఫ్గనిస్తాన్ క్రీడాకారులను పరుగులు చేయకుండా కరేబియన్లు కట్టడి చేశారు. ఆఫ్గనిస్తాన్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన నజీబుల్లా జాద్రాన్(48) నౌటవుట్ గా నిలిచాడు. కాగా, వెస్టిండీస్ బౌలర్లు ఎస్ బాద్రీ మూడు వికెట్లు తీసుకోగా, ఏడి రస్సెల్ రెండు, ఎస్ బెన్, డీజేజీ సమ్మీ చెరో వికెట్ తీసుకున్నారు.

More Telugu News