: ఇకనైనా మేల్కోండి!: సహచరులకు ధోనీ హితవు

ఇకనైనా మేల్కోవాలంటూ సహచరులకు టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పిలుపునిచ్చాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నీ ముందు టైటిల్ ఫేవరేట్ గా నీరాజనాలందుకున్న జట్టుగా చేస్తున్న ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదని పేర్కొన్నాడు. జట్టు సమష్టిగా ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని ధోనీ చెప్పాడు. ఇప్పటి వరకు టీమిండియా జట్టుగా రాణించలేదని అభిప్రాయపడ్డాడు. జట్టుగా రాణించి ఉంటే భారతజట్టు ప్రదర్శన మరోలా ఉంటుందని ధోనీ చెప్పాడు. గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లంతా సమష్టిగా రాణిస్తారని ఆశిస్తున్నానని ధోనీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇకపై ఆడనున్న మ్యాచ్ లలో విజయం మాత్రమే సరిపోదని, రన్ రేట్ కూడా కీలక పాత్ర పోషిస్తుందని ధోనీ హితవు పలికాడు. రన్ రేట్ ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లు రాణించాలని ధోనీ సూచించాడు.

More Telugu News