: రాణించిన సానియా భర్త...ఐదు వికెట్లు కోల్పోయిన పాక్

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు ఆకట్టుకుంది. వర్షంతో తడిసిన పిచ్ పై టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు ఇన్నింగ్స్ ను జాగ్రత్తగా ఆరంభించింది. ఓపెనర్లు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. దీంతో షెహజాద్ (28), షెర్జిల్ (17) భారీ షాట్లకు యత్నించి పెవిలియన్ చేరారు. అఫ్రిదీ (8) స్కోరు బోర్డును పరుగులెత్తించేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. అనంతరం అక్మల్ (22), సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ (26) ధాటిగా ఆడారు. ఈ క్రమంలో పాక్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరు భారీ షాట్లు ఆడుతూ అభిమానులను అలరించారు. దీంతో పాక్ వంద పరుగుల మార్కు దాటింది. దీంతో 17 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన పాక్ 111 పరుగులు చేసింది. అశ్విన్ మినహా బౌలింగ్ చేసిన ప్రతి ఆటగాడు వికెట్ తీయడం విశేషం.

More Telugu News