: లావా నుంచి రూ. 5,849కి అన్ని ఫీచర్లతో 4జీ స్మార్ట్ ఫోన్!

ఇండియాలో స్మార్ట్ ఫోన్లను మార్కెటింగ్ చేస్తున్న లావా సంస్థ మరో సరికొత్త మోడల్ ను పరిచయం చేసింది. ఏ71 పేరిట 4జీ ఫోన్ ను రూ. 5,849 ధరకు అందుబాటులో ఉంచింది. ఈ విషయాన్ని తన అధికార వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తూ, ఫోన్ స్పెసిఫికేషన్స్ ప్రకటించింది. 5 అంగుళాల టచ్ స్క్రీన్, 1.5 జీహెచ్ జడ్ ప్రాసెసర్ లతో పాటు 5/2 మెగాపిక్సెల్ కెమెరా, 1 జీబీ ర్యామ్, 8 జీబీ అంతర్గత మెమొరీ దీని ప్రత్యేకతలని పేర్కొంది. ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే ఫోన్ 2,500 ఎంఎహెచ్ బ్యాటరీతో లభిస్తుందని వెల్లడించింది.

More Telugu News