: పీడకలగా మారిన విహారయాత్ర...ఆమె శరీరంతో 110 మంది ఆడుకున్నారు!

జీవితంలో ఎవరూ చవిచూడని నరకాన్ని ఆమె చూసింది. ఎలాగోలా ఆ నరక కూపం నుంచి బయటపడిన ఆ మహిళ 'బాట్ అండ్ సోల్డ్' పేరుతో తాను అనుభవించిన నరకాన్ని ప్రపంచానికి పుస్తకం రూపంలో పరిచయం చేసింది. ప్రస్తుతం 25 ఏళ్లున్న మేగన్ 14 ఏళ్ల వయసులో తల్లితో కలిసి గ్రీస్ కు వెళ్లింది. అక్కడి బార్ లో జాక్ (22) అనే వ్యక్తిని కలిసింది. ఈ క్రమంలో అతనితో ప్రేమలో పడింది. ఆ బార్ ఓనర్ తో సన్నిహితంగా ఉండే ఆమె తల్లికి జాక్ నచ్చకపోయినా, మేగన్ కు అడ్డుచెప్పలేదు. దీంతో విహార యాత్ర సమయం ముగిసిన సందర్భంగా ఆమె తల్లి బ్రిటన్ వెళ్లిపోగా మేగన్ అక్కడే ఉండిపోయింది. అంతవరకు ప్రేమ చూపించిన జాక్ తన అసలు స్వరూపం అప్పుడు చూపించాడు. టాప్ లెస్ గా బార్లో పని చేయాలని డిమాండ్ చేశాడు. అలా వచ్చిన డబ్బుతో తన తల్లికి వైద్యం చేయిస్తానని చెప్పాడు. అందుకు మేగన్ అంగీకరించకపోవడంతో ఆమెను చితకబాది పింప్ అనే వ్యక్తికి అమ్మేశాడు. అలా పడుపు వృత్తిలోకి ఆమె నెట్టివేయబడింది. ఆమెతో ఐదు నిమిషాలు గడిపేందుకు విటుడు 20 జీబీపీ (గ్రీక్ కరెన్సీ) ఇచ్చేవాడు. దీనిని మరింత పెంచుకోవాలని భావించిన పింప్ 22 గంటలపాటు ఆమెను వ్యభిచరించమని డిమాండ్ చేసేవాడు. దీంతో 22 గంటల్లో ఆమె 110 మంది పక్కన పడుకోవాల్సి వచ్చేది. కొన్నాళ్లకు ఆమెను మరో వ్యభిచార కొంపకు అమ్మేశాడు. వారు మరొకరికి ఇలా ఆమె చాలాసార్లు అమ్మబడింది. కొన్ని సార్లు బ్రోతల్ హౌస్ లలో ఈ దారుణం కొనసాగితే, మరి కొన్ని సార్లు వీధుల్లోనే ఆమె వ్యభిచరించాల్సి వచ్చేది. ఎలాగోలా ఆ నరక కూపం నుంచి బయటపడిన మేగన్ బ్రిటన్ లోని తల్లిని చేరుకుంది. ఇప్పుడు ఓ వ్యక్తిని వివాహం చేసుకుని నిండైన జీవితం అనుభవిస్తోంది. గర్భంతో ఉన్న మేగన్ తన గత జీవితానుభవాలను పుస్తకరూపంలో ప్రపంచానికి చెప్పింది. తనలా కష్టాలపాలైన వారిని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఏదైనా చేయాలని ఆలోచిస్తోంది.

More Telugu News