: పండ్ల రసాలు ఎక్కువైతే ఇబ్బందే సుమా!

ఏదైనా అతిగా తిన్నా, సేవించినా అనారోగ్యం పాలవక తప్పదు. పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచివని అదేపనిగా తాగితే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే. అలాగే, కూల్ డ్రింక్స్ అదే పనిగా తాగినా ముప్పు తప్పదు. మధుమేహం బారిన పడతాం. అందుకే ఎక్కువగా వాటి జోలికి వెళ్లవద్దని బ్రిటన్ లోని ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు చెబుతున్నారు. పండ్లరసాలు, చక్కెరతో, కృత్రిమ తీపితో చేసిన కూల్ డ్రింకులపై ఈ అధ్యయనం చేశారు. ఇవి ఎక్కువగా తీసుకునేవారికి మధుమేహం వస్తుందన్న విషయం వెల్లడైంది. అప్పుడప్పుడు కూల్ డ్రింకులు, పళ్ల రసాలు తాగితే ఫర్వాలేదు కానీ, అతిగా తీసుకోవద్దని వారు హెచ్చరించారు.

More Telugu News