: షాపింగుకు సరైన తరుణం... 2.5 కోట్ల ఉత్పత్తులపై 100% క్యాష్ బ్యాక్ అందిస్తున్న సంస్థ ఇదే!

మంచి తరుణం మించిన దొరకదు. ఈ దీపావళికి ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికి ఇంతకన్నా బెటర్ డీల్స్ లభించవేమో. 500కు పైగా కేటగిరీల్లోని 2.5 కోట్ల ప్రొడక్టులపై 100 శాతం క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేస్తున్నట్టు ఈ-కామర్స్ సంస్థ పేటీఎం వెల్లడించింది. అంతకుమించిన ప్రొడక్టులపై 83 శాతం డిస్కౌంట్లను ప్రకటించామని, ఈ ఫెస్టివ్ సీజనులో సాధ్యమైనంత ఎక్కువ మార్కెట్ వాటాను నమోదు చేసుకోవడమే తమ ఉద్దేశమని వెల్లడించింది. ఆదాయం కోసం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆఫర్లను పేటీఎం ప్రకటించినట్టు తెలుస్తోంది. సమయానికి ఆర్డర్లను డెలివరీ చేసేందుకు 30కి పైగా చిన్నా, పెద్ద డెలివరీ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంది కూడా.

More Telugu News