: ఏ ఐటీ సంస్థా అంచనాలకు తగ్గట్టుగా లేదు: నాస్కామ్

2016 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలోని ఏ ప్రముఖ ఐటీ సంస్థ కూడా అంచనాలకు మించిన వృద్ధి లక్ష్యాలను సాధించే పరిస్థితుల్లో లేదని నాస్కామ్ అభిప్రాయపడింది. ఈ సంవత్సరం ఐటీ కంపెనీలు 12 నుంచి 14 శాతం వరకూ వృద్ధి లక్ష్యాలను అంచనా వేయగా, ఇండియాలోని టాప్-4 కంపెనీలు లక్ష్యాలను అందుకోలేకపోవచ్చని వెల్లడించింది. ఇతర ఐటీ కంపెనీలకు ఇది ముందస్తు హెచ్చరికని తెలిపింది. ఈ కంపెనీల మూడవ త్రైమాసికం ఫలితాలు అత్యంత కీలకమని, ఈ త్రైమాసికంలో భవిష్యత్ ఆదాయ, వ్యయాల అంచనా కీలకమని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత్ గుప్తా వెల్లడించారు. చైనా స్టాక్ మార్కెట్ క్రాష్, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గడం వంటి కారణాలతోనూ ఐటి కంపెనీలు మందగమనంలో సాగుతున్నాయని ఆయన తెలిపారు.

More Telugu News