: ఫేస్ బుక్ చీఫ్ కూ తప్పని ట్రాఫిక్ చిక్కులు... తాజ్ మహల్ సందర్శన తర్వాత ఇక్కట్లు

ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ కు నిన్నటి భారత పర్యటనలో ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యాయి. ఢిల్లీ ఐఐటీ విద్యార్థులతో భేటీ అయిన తర్వాత జుకెర్ బర్గ్ ఆగ్రాలోని ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్ సందర్శనకు వెళ్లారు. తాజ్ సందర్శన అనంతరం తిరిగి ఢిల్లీ వస్తుండగా, మహాలయ ఫ్లై ఓవర్ పై ఆయన ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. చాంతాడంత పొడవున వాహనాలు నిలిచిపోవడంతో కారు దిగిన జుకెర్ బర్గ్ అక్కడి స్థానికులతో మాట కలిపారు. అంతేకాక కాక అక్కడ విక్రయిస్తున్న కచోరీలను కొనుగోలు చేసిన జుకెర్ బర్గ్ వాటి రుచిని ఆస్వాదించారు.

More Telugu News