: మీవన్నీ తప్పుడు అభియోగాలే... దర్యాప్తు చేయండి: సీబీఐ డైరెర్టర్ కు షాకిచ్చిన ప్రత్యేక కోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అదనపు స్ప్రెక్ట్రం కేటాయింపు కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీబీఐ అధికారులకు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు షాకిచ్చింది. కేంద్ర టెలికాం శాఖ మాజీ కార్యదర్శి శ్యామల్ ఘోష్ పై సీబీఐ అధికారులు తప్పుడు కేసులు బనాయించారని ఆక్షేపించింది. ఈ మేరకు నేటి ఉదయం జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి సీబీఐ అధికారుల తీరును తప్పుబట్టారు. అంతేకాక తప్పుడు కేసులతో నానా తంటాలు పడుతున్న శ్యామల్ ఘోష్ కు ఈ కేసు నుంచి విముక్తి కల్పించారు. ఇక శ్యామల్ ఘోష్ పై తప్పుడు కేసులు బనాయించిన సీబీఐ అధికారులపై విచారణకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీనిని సీబీఐ డైరెక్టర్ కే అప్పజెబుతూ న్యాయమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

More Telugu News