: మంత్రి కాగానే హరీష్ రావు రైతులను మరచిపోయారు: రేవంత్ రెడ్డి

మంత్రి పదవి చేపట్టిన వెంటనే హరీష్ రావు రైతులను మరచిపోయారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మామ, అల్లుళ్ల అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఈ రోజు ఆయన మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం మందపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా, ఆ గ్రామానికి చెందిన ప్రాణహిత-చేవెళ్ల నిర్వాసితులు రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు టీడీపీ పోరాడుతుందని చెప్పారు.

More Telugu News