: చిత్తూరు టాస్క్ ఫోర్స్ పోలీసుల వలలో మరో స్మగ్లర్

టాస్క్ ఫోర్స్ పోలీసులకు మరో ఎర్రచందనం స్మగ్లర్ చిక్కాడు. సంవత్సరకాలంగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అతన్ని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ సీఐ నేతృత్వంలో బెంగళూరులోని అల్తాఫ్ ఫాంహస్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అల్తాఫ్ ను చిత్తూరుకు తరలిస్తున్నారు.

More Telugu News