: సింగపూర్ లో ల్యాండవుతూ కుప్పకూలిన విమానం

సింగపూర్ లోని చంగి ఎయిర్ పోర్టులో ఒక జెట్ విమానం రన్ వేపై ల్యాండవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిన సంఘటన ఈరోజు చోటుచేసుకుంది. విమానం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే, విమానంలో ప్రయాణికులెవ్వరూ లేరని సింగపూర్ ఎయిర్ లైన్స్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఎయిర్ బస్ 330-300 జెట్ విమానం షాంఘై పుడాంగ్ విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున సింగపూర్ చేరుకుంది. అక్కడి నుంచి హాంకాంగ్ వెళ్లాల్సి ఉంది. అయితే, సింగపూర్ లో ఈ విమానానికి తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో విమానం లోపల ఒక ఇంజనీరు మాత్రమే ఉన్నాడు.

More Telugu News