: వందకోట్లతో అమెరికా గడ్డపై హిందూ దేవాలయం

అమెరికాలోని న్యూజెర్సీలో ఓ హిందూ దేవాలయాన్ని భారీ వ్యయంతో నిర్మించారు. వచ్చే వారం ఈ ఆలయ సముదాయం ప్రారంభోత్సవం జరుపుకోనుంది. దీని నిర్మాణానికి రూ.110 కోట్లు ఖర్చయ్యాయి. ఈ దేవాలయం పూర్తిగా ఇటాలియన్ మార్బుల్స్ తో రూపుదిద్దుకుంది. బొకాసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆధ్వర్యంలో ఈ గుడి కట్టారు. ఇందులో 108 స్థంభాలు, మూడు గర్భ గుడులు ఉంటాయి. ఈ ఆలయాన్ని పురాతన శిల్ప శాస్త్రం ఆధారంగా నిర్మించారు. కాగా, ప్రారంభోత్సవం సందర్భంగా వేద యజ్ఞం, భక్తుల శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఆగస్టు 9, 10న జరుపుకునే ప్రారంభోవత్సవ వేడుకల అనంతరం ఆగస్టు 16న భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించనున్నారు.

More Telugu News