: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్థీకరించొద్దని మళ్లీ ఆందోళనకు దిగిన ఓయూ విద్యార్థులు

ఓయు విద్యార్థులు నాంపల్లిలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర జూనియర్ లెక్చరర్ల సంఘం సదస్సును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించొద్దని ఓయూ విద్యార్థులు ధర్నాకు దిగారు. సదస్సును అడ్డుకోవడంతో జూనియర్ లెక్చరర్లు, విద్యార్థుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్రతరం కావడంతో... పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

More Telugu News