: పాకిస్థాన్, రజాకార్లే టీఆర్ఎస్ కు గొప్ప: లక్ష్మీపార్వతి

టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైకాపా నాయకురాలు లక్ష్మీపార్వతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన శత్రు దేశం పాకిస్థాన్, తెలంగాణలో అత్యంత దారుణాలకు ఒడిగట్టిన రజాకార్లే వీరికి అత్యంత ఇష్టులని, గొప్పవారని మండిపడ్డారు. సాటి తెలుగువారు మాత్రం వీరికి శత్రువులని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రవర్తనతో తెలుగు జాతి ముక్కలయ్యే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ చానల్ వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News