ముక్తిని ప్రసాదించే ముక్తీశ్వరుడు!
Thu, Apr 20, 2017, 09:07 AM

ఈ క్షేత్రంలోని 'ముక్తేశ్వరుడు' శ్రీరాముడి కాలానికంటే ముందు నుంచే కొలువై వున్నాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శ్రీరామచంద్రుడు కూడా ఈ స్వామిని సేవించాడని అంటారు. శ్రీరాముడు ప్రార్ధించిన వెంటనే స్వామి క్షణ కాలంలో ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడట. అందువలన ఇక్కడి స్వామివారిని 'క్షణ ముక్తేశ్వరుడు' అనే పేరుతోనూ భక్తులు పిలుచుకుంటూ వుంటారు. దర్శన మాత్రం చేతనే స్వామి ముక్తిని ప్రసాదిస్తాడు కనుక, సోమవారాల్లోను .. విశేషమైన పర్వదినాల్లోను ఈ క్షేత్ర దర్శనం చేసే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.