శ్రీ భ్రమరాంబా దేవి
Tue, Jun 18, 2013, 12:42 PM

పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి సాక్షాత్కారం కోసం తపస్సు చేసి, దేవతల వలన గానీ ... మానవులవలన గాని ... ఆయుధాల వలన గాని తనకి ప్రాణహాని కలగకుండా వరాన్ని పొందాడు. ఈ వరం కారణంగా అరుణాసురుడు ముల్లోకాలలో అల్లకల్లోలాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు.
దాంతో దేవతలంతా కూడా కైలాసం చేరుకొని జగన్మాతను ప్రార్ధించారు. అప్పుడామె భ్రమరములతో సహా ఝంకారమ్ చేస్తూ ప్రత్యక్షమైంది. విషయం తెలుసుకుని భ్రమరముల సైన్యంతోనే అరుణా సురుడిని సంహరించింది. ఈ కారణంగా అమ్మవారు భ్రమరాంబా దేవిగా ఇక్కడ వెలిసి మల్లికార్జున స్వామి సహితంగా నిత్య పూజలు అందుకుంటోంది.
అమ్మవారి మూలవిరాట్టు ఉగ్ర రూపంతో ఉన్నప్పటికీ, అలంకారం వల్ల సౌమ్య మూర్తిగా కనిపిస్తుంది. శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని చూస్తూనే 'సౌందర్యలహరి' రచించి ... శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెబుతోంది.