కనకధారా స్తోత్రం పఠన ఫలితం

శంకర భగవత్పాదులవారు ఒక పేదరాలి దారిద్ర్యాన్ని తొలగించడం కోసం 'కనకధారా స్తోత్రం' ఆశువుగా చెప్పారు. ఫలితంగా లక్ష్మీదేవి ఆ పేదరాలి వాకిట్లో బంగారు ఉసిరికాయలు కురిపించి అనుగ్రహించింది. అలాంటి 'కనకధారా స్తోత్రం' ఎంతో శక్తిమంతమైనది .. మరెంతో మహిమాన్వితమైనది. దారిద్ర్యంతో బాధ పడేవారు ఈ స్తోత్రాన్ని అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించడం వలన దారిద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

ఇక వ్యాపార సంబంధమైన విషయాల్లో ఆటంకాలు ఏర్పడినప్పుడు .. వ్యాపారంలో నష్టాలు ఎదురవుతున్నప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి ఫలితం ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక చాలా మంది అప్పులతో బాధపడుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేసి .. వాటిని తీర్చలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పఠించడం వలన ఫలితం ఉంటుంది. ఇక నానా రకాల సమస్యలు చుట్టుముట్టి ఆవేదానికి గురిచేస్తున్నట్టయితే, విష్ణు సహస్రనామ పారాయణం చేయడానికి మించిన విరుగుడు లేదనేది మహర్షుల మాట.      


More Bhakti News