తెలంగాణ జర్నలిస్టులకు గొప్ప శుభవార్త: అల్లం నారాయణ

Related image

సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యపై జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారికి,  మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీలు,ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ తో సంబంధం లేకుండా సామాన్య జర్నలిస్టులకు ఇండ్లు నిర్మించుకోవడానికి ఇండ్లు కేటాయించడానికి తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో ప్రగతిభవన్లో, కేసీఆర్ అనేకసార్లు చర్చించి స్థలాల కేటాయింపుకు అనుకూల నిర్ణయం తీసుకున్నారు.

ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్య సుప్రీంకోర్టు లో పెండింగ్ ఉండటం వల్ల ఇన్ని రోజులుగా ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది ఇప్పుడు సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడం వల్ల చాలా రోజులుగా తీరని సమస్యకు పరిష్కారం వచ్చింది. భవిష్యత్తులో ఇప్పుడు రాష్ట్రంలోని అందరు జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాల కేటాయింపులో అడ్డంకులు తొలగిపోయాయి. ఇది తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తర్వాత తెలంగాణ యూనియన్ ఆప్ వర్కింగ్ జర్నలిస్టుల, ఆ తర్వాత ఏర్పడిన మీడియా అకాడమీ విజయంగా భావిస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంలోని పాత జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ స్థానంలో ,  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం, మీడియా అకాడమీ లతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత, జర్నలిస్టు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అధ్యక్షతన కొత్త కమిటీ ఏర్పడినది. కమిటీ అధ్యక్షుడు క్రాంతి,ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ప్రముఖులతో చర్చలు, తరువాత అందరి సహాయ సహకారాలతో, ఇన్నాళ్లకు సుప్రీం కోర్ట్ తీర్పు ఇవ్వడం సంతోషం అని అల్లం నారాయణ అన్నారు.

యూనియన్లు, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సుప్రీంకోర్టు నిర్ణయం,మనందరి  ఈ విజయాన్ని ఆహ్వానిద్దాం. డబ్బులు కట్టి 13 సంవత్సరాలు నిరీక్షిస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ శుభాకాంక్షలని హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. డబ్బులు సర్ద లేక,  భార్య పుస్తెలు తాకట్టు పెట్టి రెండు లక్షలు కట్టిన వారి కల సకారం అయ్యే రోజు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు, డబ్బులు కేటాయించిన ఇండ్ల స్థలాలకు ఫెన్సింగ్ వేసిన హెచ్ఎండిఏ కు, కేసు పరిష్కారంలో సహకరించిన ఢిల్లీ జర్నలిస్టులకు, ఓపికగా పని చేసిన సెక్రెటరీ వంశీకి కృతజ్ఞతలు తెలిపారు.

తీర్పు అనుకూలంగా రావడానికి తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల జీవన ప్రమాణాలు తెలుపుతూ ఇచ్చిన అఫిడవిట్ కీలకమైందని సొసైటీ సెక్రటరీ వంశీ అన్నారు. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రతి అందిన తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. సమావేశంలో టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రెటరీ మారుతి సాగర్, జర్నలిస్ట్ నాయకులు బసవ పున్నయ్య, యోగానంద్, నవీన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases