ఎల‌క్ట్రిక‌ల్ వెహికిల్స్‌పై అవగాహనకు హైదరాబాద్ లో ఈవీ రైడ్ ర్యాలీని నిర్వ‌హించిన ట్రైడ్ మొబిలిటీ

Related image

* జెండా ఊపి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి టీ-హ‌బ్ సీఈవో


హైద‌రాబాద్, ఆగ‌స్టు 14, 2022: 75వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా, ఎల‌క్ట్రిక‌ల్ వెహికిల్స్‌పై  అవగాహన కల్పించడానికి ట్రైడ్ మొబిలిటీ ఆదివారం హైదరాబాద్‌లో "ఈవీ రైడ్ విత్ ప్రైడ్" కార్యక్రమాన్ని నిర్వహించింది.

టి-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, “ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇప్పుడు స్థిరంగా ఉండ‌బోతోంది. ఇది రవాణా రంగ భవిష్యత్తును సూచిస్తుంది. ఇది మరింత సమర్థవంతమైన, పర్యావరణ అనుకూల‌, స్థిరమైన రవాణా మార్గం. నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత సమర్థవంతంగా చేస్తుంది, దానికి కొత్త ఉపయోగాలను సృష్టిస్తుంది. టి-హ‌బ్‌లో ఇంక్యుబేట్ అయిన స్టార్ట‌ప్ ట్రైడ్ మొబిలిటీ వారి టెక్నాలజీ ఆధారిత ప్లాట్ ఫారం ద్వారా ప‌రిశుభ్ర‌మైన ర‌వాణా మార్గాల‌ను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది” అని చెప్పారు.

ఈ ర్యాలీలో 15కు పైగా ప్రముఖ ఈవీ టూ వీలర్ బ్రాండ్ల నుంచి 50 మందికి పైగా రైడర్లు పాల్గొన్నారు. వారు తెలుగుత‌ల్లి ఫ్లైఓవర్ నుంచి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఎల‌క్ట్రిక‌ల్ వెహికిల్స్‌పై ప‌రిశుభ్ర‌మైన ఇంధ‌న ప‌రిష్కారాల‌ను ఎలా అందిస్తాయ‌నే బలమైన సందేశాన్ని వ్యాపింప‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ట్రైడ్ మొబిలిటీ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈవో మాధ‌వ్ అప్పిరెడ్డి మాట్లాడుతూ, “ఈ కార్య‌క్ర‌మంలో, స్వ‌చ్ఛ ర‌వాణా అవ‌కాశాల‌ను ప్రోత్సహించే లక్ష్యంతో విభిన్న ఈవీ బ్రాండ్ల నుంచి సమిష్టి భాగస్వామ్యం, సహకారాన్ని మేం చూశాం. మా ఈవీ రైడ్స్ బీ2బీ ఎస్ఏఏఎస్ ప్లాట్ ఫారం ద్వారా, ఓఏఎంలు మరియు ఈవీ ఛానల్ భాగస్వాములకు వారి కస్టమర్ల‌ ప్రయాణాన్ని డిజిటలైజ్ చేయడానికి, వారి ఎండ్-టు-ఎండ్ సప్లై చైన్ కార్యకలాపాలను నిర్వహించడానికి మేం సాధికారతను కల్పిస్తున్నాం. మేము ప్రస్తుతం మా ఎండ్-టు-ఎండ్ ఎస్ఏఏఎస్ పరిష్కారాలను అందించే ఈ రంగంలో 15కుపైగా బ్రాండ్లతో పనిచేస్తున్నాము” అని తెలిపారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌వారు రైడ్ స‌మ‌యంలో ఎల‌క్ట్రిక‌ల్ వెహికిల్స్‌పై అవ‌గాహ‌న క‌ల్పించే సందేశాల‌తో కూడిన ప్ల‌కార్డులు, జాతీయ ప‌తాకాలు ప్ర‌ద‌ర్శించారు. విద్యుత్ ర‌వాణా రంగం ప్రజల జీవన నాణ్యతను ఎలా మెరుగుపరుస్తుంది, రాబోయే తరాలకు స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుందనే దాంతో పాటు, దేశభక్తి భావనను ఈ మొత్తం కార్యక్రమం ప్రోత్సహించింది.

ఈ సంద‌ర్భంగా ట్రైడ్ మొబిలిటీ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఓఓ క్రాంతికుమార్ మాట్లాడుతూ, “75 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొందింది. కాలుష్యం నుంచి కూడా స్వాతంత్య్రం పొంద‌డానికి,  భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడటానికి మనమందరం ఏకం కావాల్సిన సమయం ఇది. ఒక నివేదిక ప్రకారం 2030 నాటికి 45% కార్బన్ తీవ్రతను స్వ‌చ్ఛ ఇంధ‌నాల వాడ‌కం ద్వారా తగ్గించవచ్చు. వినియోగ‌దారులు మరింత ఆత్మవిశ్వాసంతో  ఎల‌క్ట్రిక‌ల్ వెహికిల్స్‌ను మ‌రింత సుల‌భంగా వాడ‌డానికి, ఈవీ వ్య‌వ‌స్థ‌ను డిజిటలైజ్ చేయడానికి, నిర్వ‌హించ‌డానికి, సరళీకృతం చేయడానికి ట్రైడ్ మొబిలిటీలో మేం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం” అన్నారు. 

ట్రైడ్ మొబిలిటీ అనేది కీలక భాగస్వాములైన‌ - కస్టమర్లు, ఓఈఎంలు, ఛానల్ భాగస్వాములు, సర్వీసు ప్రొవైడర్లకు చిట్ట‌చివ‌రి వ‌ర‌కు వ్యాపార విలువ‌ను సృష్టించే ఒక టెక్ ప్లాట్‌ఫాంను అందిస్తోంది. దీనిద్వారా ఈవీ యూజ‌ర్లు రీసెర్చ్ చేయవచ్చు, పోల్చవచ్చు, బుక్ చేయవచ్చు, తాము ఎంచుకున్న ఈవీపై సమాచారంతో కూడిన కొనుగోలు నిర్ణయం తీసుకోవచ్చు. అత్యంత సాంకేతిక‌త‌తో కూడిన ఈ ప్లాట్‌ఫాం ద్వారానే వాళ్లు త‌మ వెహికిల్‌ గురించి రీసెర్చ్ నుంచి రీసేల్ వ‌ర‌కూ ఏదైనా నిరంత‌రాయంగా చేసుకోవ‌చ్చు. డేటా సైన్సెస్, ఏఐ/ఎంఎల్ ఆధారిత రెకో-ఇంజిన్ అప్లికేషన్, యూజర్ల‌కు జీవితాంతం కావ‌ల్సిన స‌రైన ఉత్ప‌త్తులు, సేవ‌ల‌ను సూచిస్తుంది.  బీ2బీ ఎస్ఏఏఎస్ ప్లాట్ ఫారమ్ ద్వారా ఈవీ రైడ్లు, ఓఈఎంలు, వారి ఛానల్ భాగస్వాములు, ఈవీ యూజ‌ర్ల‌కు అన్ని స్థాయిల‌లో డిజిట‌లైజ్డ్ సేవ‌ల‌ను అందించ‌డానికి,  వాళ్ల కార్య‌క‌లాపాల‌న్నింటి నిర్వ‌హ‌ణ‌కు వీలుంటుంది

     

More Press Releases