బోయిగూడ అగ్ని ప్రమాద సంఘటన స్థలానికి హుటాహుటిన వెళ్లిన సీఎస్ సోమేశ్ కుమార్

Related image

హైదరాబాద్, మార్చి 23 : సికిందరాబాద్ బోయిగూడ స్క్రాప్  గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన విషయాన్ని తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ బోయిగూడకు చేరుకున్న సీఎస్ సోమేశ్ కుమార్ అగ్నిమాపక, జీహెచ్ఎంసీ ఈవీడీఎం బృందాలు చేపడుతున్న అగ్నిమాపక నివారణా చర్యలను పరిశీలించారు.

అగ్ని ప్రమాదం జరిగిన నేపధ్యాన్ని పోలీసు, అగ్నిమాపక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన జరగడం అత్యంత విచారకరమని, ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టనున్నట్టు సీఎస్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.

మరణించిన మృతదేహాలను బీహార్ లోని వారి స్వస్థలానికి పంపేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. బోయిగూడ నుండి సికిందరాబాద్ గాంధీ హాస్పిటల్ కు వెళ్లి మార్చురీలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి వెంటనే పోస్ట్ మార్టం నిర్వహించాలని ఆదేశించారు. గుర్తుపట్టకుండా ఉన్న మృత దేహాలను డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి గుర్తించాలని సూచించారు. ఈ ప్రమాద సంఘటన నుండి గాయాలతో బయటపడ్డ వ్యక్తికీ అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలూ అందచేయాలని వైద్యులను ఆదేశించారు.

More Press Releases