నాలా విస్తరణ పనులపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

Related image

హైదరాబాద్, డిసెంబర్ 14: జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్.ఎన్.డీ.పీ.)పై నేడు బీఆర్కేఆర్ భవన్ లో సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, ఈ.ఎన్.సి జియాఉద్దీన్, జోనల్ కమీషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

More Press Releases