తెలంగాణకు మరో కేంద్ర అవార్డు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

Related image

  • ఈ- పంచాయతీ నిర్వహణ లో దేశంలో మనమే నెంబర్ వన్
  • ప్రకటించిన కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఆర్థిక సలహాదారు బిజయ కుమార్ బెహరా
  • సీఎం కేసీఆర్ కృషి, ముందు చూపు, చొరవ, మార్గదర్శనం వల్లే ఈ అవార్డులు: మంత్రి ఎర్రబెల్లి
  • కేంద్రానికి కృతజ్ఞతలు.. సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు: మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్: ఈ మధ్య అవార్డుల మీద అవార్డులు సాధిస్తున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మరో అవార్డును గెలుచుకుంది. గ్రామ పంచాయతీలలో ఇన్ఫర్మేషన్ అండ్ communication టెక్నాలజీతో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అంటూ కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఈ పంచాయత్ పురస్కారాలను అందచేస్తున్నది. ఈ ఏడాది 2019-20కి ఈ e-award దక్కింది.

దేశంలోని గ్రామ పంచాయతీలను ఇన్ఫర్మేషన్ అండ్ communication టెక్నాలజీతో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం పెంపొందిస్తున్న గ్రామాలను మూడు విభాలుగా విభజించింది. పంచాయతీ ఎంటర్ ప్రైజ్ సూట్అప్లికేషన్స్ అండ్ స్టేట్ specific applications లలో 3 విభాగాలుగా విభజించింది. అందులో 2వ విభాగంలో తెలంగాణ మొదటి స్థానం దక్కించుకోగా, రెండో స్థానం ఆంధ్ర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మూడో స్థానం రాజస్థాన్ కు వచ్చింది.

ఈ అవార్డు రావ‌డం ప‌ట్ల రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కేంద్రానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ అవార్డులు రావ‌డానికి కార‌ణ‌మైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మార్గ‌ద‌ర్శి సీఎం కేసీఆర్ కి ధ‌న్య‌వాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ కృషి, దార్శ‌నిక‌త వ‌ల్లే ఇదంతా సాధ్య‌ప‌డింద‌ని అన్నారు.

ఇంత మంచి శాఖ‌ను త‌న‌కు అప్ప‌గించ‌డం, అనేక అవార్డులు రావ‌డం త‌న అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి చెప్పారు. అంతేగాక తెలంగాణ ఏర్ప‌డ్డాక‌, గాంధీజీ క‌ల‌లుగ‌న్న గ్రామ స్వ‌రాజ్య స్థాప‌న‌కు సీఎం కేసీఆర్ ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని తీసుకువ‌చ్చార‌న్నారు.

అలాగే గ్రామ పంచాయతీల్లో ఇన్ఫర్మేషన్ అండ్ communication టెక్నాలజీతో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం పెంపొందిస్తున్నారని అన్నారు. కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర స్థానిక సంస్థలకు 12 అవార్డులు వచ్చాయని, అంతకు ముందు స్వచ్ఛ సర్వేక్షన్ వంటి అనేక అవార్డులు వచ్చాయన్నారు. ఇప్పుడు అలాంటి గంగ‌దేవి ప‌ల్లెలు తెలంగాణ రాష్ట్ర‌మంతా ఏర్ప‌డుతున్నాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. వాటికి నిద‌ర్శ‌న‌మే ఈ అవార్డుల‌ని మంత్రి తెలిపారు.

కాగా, ఈ అవార్డులు రావడానికి తీవ్రంగా కృషి చేస్తున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, తన పేషి, ఇతర రాష్ట్ర స్థాయి నుండి పారిశుధ్య కార్మికుల వరకు ప్రతి ఒక్కరికీ మంత్రి అభినందనలు తెలిపారు.

More Press Releases