రీజిన‌ల్ ఔట్ రీచ్ బ్యూరో, హైద‌రాబాద్ ఆధ్వ‌ర్యంలో ఫోటో ఎగ్జిబిష‌న్ ను ప్ర‌శంసించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళి‌సై

Related image

  • స్వాత్రంత్య పోరాట ఘ‌ట్టాల‌ను చాటిచెప్పిన చాయాచిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌
  • `ఆజాదీ కా అమృత్ వ‌ర్ష్` వేడుక‌ల సంద‌ర్భంగా వ‌రంగ‌ల్ పోలీస్ గ్రౌండ్స్‌లో పాల్గొన్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌
  • దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు పోరాటం స‌ల్పిన వారిని స్మ‌రించుకున్న గ‌వ‌ర్న‌ర్‌
  • క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించే డిజిట‌ల్ ప్ర‌సార వాహ‌నాల‌ను తిల‌కించిన రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌
వ‌రంగ‌ల్, మార్చి 12, 2021: కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ, రీజిన‌ల్ ఔట్ రీచ్ బ్యూరో హైద‌రాబాద్ ఆధ్వ‌ర్యంలో `ఆజాదీ కా అమృత్ వ‌ర్ష్` వేడుక‌ల ప్రారంభోత్సవం సంద‌ర్భంగా వ‌రంగ‌ల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌ను తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి ‌సై సౌంద‌ర రాజ‌న్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎగ్జిబిష‌న్‌లోని ప్ర‌తి ఫోటోనూ ఆస‌క్తిగా వీక్షించిన‌ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్, దండి మార్చ్ నుంచి మొద‌లుకొని స్వాత్రంత్య పోరాట ఘ‌ట్టాల‌ను చాటి చెప్పేలా ఉన్న అరుదైన చిత్రాల‌తో ఎగ్జిబిష‌న్‌ను ఆక‌ట్టుకుంద‌ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌శంసించారు.

ఫోటో ఎగ్జిబిష‌న్ ను తిల‌కించిన వారికి స్వాత్రంత్య పోరాటం యొక్క ఉద్విగ్న ఘ‌ట్టాలు గుర్తుకు వస్తాయ‌ని గ‌వ‌ర్న‌ర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రీజిన‌ల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ డిజిట‌ల్ ప్ర‌చార వాహ‌నాల‌ను కూడా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ తిల‌కించారు. క‌రోనా మ‌హమ్మారి విష‌యంలో ప్ర‌జ‌లు త‌గు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

ఈ సంద‌ర్భంగా స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ, ద‌క్షిణ భార‌త‌దేశ డైరెక్ట‌ర్ జ‌న‌రల్ వేంకటేశ్వర్లు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సార‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం స్వాతంత్య్ర పోరాటానికి 75 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా `ఆజాదీ కా అమృత్ వ‌ర్ష్` కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ యొక్క రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో హైద‌రాబాద్ విభాగం ఈ ఫోటో ఎగ్జిబిష‌న్ ఏర్పాటు చేసింద‌ని వెల్ల‌డించారు.

స్వాతంత్య్ర పోరాటంలోని కీల‌క ఘ‌ట్టాల‌కు వేదిక‌గా ఈ ఎగ్జిబిష‌న్ ఉంద‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రీజిన‌ల్ ఔట్ రీచ్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మాన‌స్ కృష్ణ‌కాంత్, ఆర్ఓబీ అధి‌కారులు శ్రీ‌ధ‌ర్ సూరునేని, అర్ధ శ్రీ‌నివాస్, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

More Press Releases